పరబ్రహ్మా తత్వాలు మనకు కొన్ని జాబితాలుగా ఉన్నాయి.
- జలం
- అగ్ని
- వాయువు
- రస లింగం (పాదరసం తో చేసింది).
- హిరణ్య లింగం (బంగారంతో చేసింది).
- దారుముర్తి (కొయ్యతో చేయబడినటువంటి భగవత్ స్వరూపం).
- శిలా మూర్తి (శిల తో చెక్కబడినటువంటి భగవాన్ మూర్తి ).
- పరమ ఈశ్వర భక్తుడు ( గోవు ).
ఇలా ఇచ్చిన జాబితాలో మనం కొన్నిటికి తులా భారం వేయలేము కొన్నిటికి వేయకూడదు.
పంచ భూతలయిన అగ్ని , వాయువు , నీరు , ఆకాశం , భూమి ఇవన్ని భగవత్ స్వరుపలె కాని వీటిలో దేన్నీ మనం తులబారం వేయలేము. ఇక రస లింగం , హిరణ్య లింగం , దారుముర్తి , శీలా మూర్తి వీటిని మనం తులబారం వేయకూడదు.
తులా భారం వేయడానికి యోగ్యమయిన ఒకే ఒక్క పరబ్రహ్మాతత్వ సంబంధమయిన పదార్థం గోవు ఒక్కటే. అందుకే జన్మ జన్మాంతర సుకృతం గోవుకి తులా భారం వేయడం.
పచ్చి గడ్డి , బెల్లం, ఎండు గడ్డి, తవుడు ఇలాంటివి వేసి ఆ పదార్థాన్ని గోశాలకు దానంగా ఇచ్చేయాలి.
గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఆయా గ్రహములకు సంబంధించిన ధాన్యాన్ని దానం చేయాలో అలాంటి ధాన్యం తో తులబారం వేయాలి.
ఉదా :- రవికి దోషం ఉంటె గోదుమలు .
శనికి దోషం ఉంటె నల్ల నువ్వులు.
కేతువుకి దోషం ఉంటె మినుములు.
రహువుకి దోషం ఉంటె ఉలవలు.
వీటిని గోవు ప్రతి రోజు దానాలో వేస్తే గోవు తిన్నది అంటే 33 కోట్ల దేవతలు తినట్లే అంత అపురూపమయింది ఈ గోవు.